మరి కొన్నిరోజుల్లో ఫిఫా వరల్డ్ కప్... భారత్లో ప్రసారాలపై ఇంకా వీడని అనిశ్చితి
- మరికొన్ని రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్, ప్రసారాలపై వీడని ఉత్కంఠ
- ప్రసార హక్కుల రేసులో జీ నెట్వర్క్ ముందంజ
- భారీ ధర, అనుకూలించని మ్యాచ్ సమయాలతో చర్చల్లో జాప్యం
- ఒప్పందం కుదిరితే జీ స్పోర్ట్స్, జీ5లో అన్ని మ్యాచ్ల ప్రసారం
- జియోస్టార్ ఆఫర్ను తిరస్కరించిన ఫిఫా
ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ 2026 ప్రారంభానికి కొద్ది రోజులే ఉన్నా, భారత్లో ప్రసారాలపై ఇంకా సందిగ్ధత వీడలేదు. జూన్ 11న మెగా టోర్నీ మొదలుకానుండగా, ఏ ఛానెల్లో మ్యాచ్లు వస్తాయో తెలియక కోట్లాది మంది అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, చివరి నిమిషంలో ఈ ఉత్కంఠకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బ్రాడ్కాస్టింగ్ సంస్థ 'జీ' నెట్వర్క్ ప్రసార హక్కులను దక్కించుకునేందుకు గట్టిగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
దాదాపు 30-35 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 250-290 కోట్లు) ఒప్పందంతో జీ నెట్వర్క్ ఈ హక్కులను సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. ఒప్పందం ఖరారైతే, టోర్నీలోని మొత్తం 104 మ్యాచ్లను జీ స్పోర్ట్స్ ఛానెళ్లలో, అలాగే జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో బహుళ భాషల కామెంటరీతో ప్రసారం చేయనున్నారు. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు.
ఈసారి ప్రసార హక్కుల విషయంలో జాప్యం జరగడానికి ప్రధాన కారణం ఫిఫా మొదట అధిక ధర డిమాండ్ చేయడమే. 2026, 2030 సీజన్లకు కలిపి దాదాపు 100 మిలియన్ డాలర్లు ఆశించడంతో బ్రాడ్కాస్టర్లు వెనకడుగు వేశారు. దీనికి తోడు, భారత్లోని వీక్షకులకు మ్యాచ్ సమయాలు అనుకూలంగా లేకపోవడం మరో ప్రతికూలాంశంగా మారింది. చాలా మ్యాచ్లు అర్ధరాత్రి, తెల్లవారుజామున జరగనున్నాయి. మొత్తం 104 మ్యాచ్లలో కేవలం 14 మాత్రమే భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రిలోపు ప్రారంభం కానున్నాయి. ఫైనల్ మ్యాచ్ సైతం అర్ధరాత్రి దాటాక 12:30 గంటలకు జరగనుంది. ఈ కారణాలతో జియోస్టార్ కేవలం 20 మిలియన్ డాలర్ల ప్రతిపాదనన ఫిఫా ముందుంచింది. అయితే ఈ ఆఫర్ను ఫిఫా తిరస్కరించింది.
భారత జట్టు ప్రపంచకప్కు అర్హత సాధించకపోయినా, ఇక్కడ ఫుట్బాల్కు విపరీతమైన ఆదరణ ఉంది. 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ను భారత్లో 110 మిలియన్ల మంది డిజిటల్ మాధ్యమాల్లో వీక్షించారు. ఇది ఫిఫా ప్రపంచ వీక్షకుల్లో 2.9 శాతం కావడం విశేషం. ఏదేమైనా, ఆలస్యమైనప్పటికీ అభిమానులకు ప్రపంచకప్ మ్యాచ్లను చూసే అవకాశం లభించడం ఖాయంగానే కనిపిస్తోంది.
దాదాపు 30-35 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 250-290 కోట్లు) ఒప్పందంతో జీ నెట్వర్క్ ఈ హక్కులను సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. ఒప్పందం ఖరారైతే, టోర్నీలోని మొత్తం 104 మ్యాచ్లను జీ స్పోర్ట్స్ ఛానెళ్లలో, అలాగే జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో బహుళ భాషల కామెంటరీతో ప్రసారం చేయనున్నారు. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు.
ఈసారి ప్రసార హక్కుల విషయంలో జాప్యం జరగడానికి ప్రధాన కారణం ఫిఫా మొదట అధిక ధర డిమాండ్ చేయడమే. 2026, 2030 సీజన్లకు కలిపి దాదాపు 100 మిలియన్ డాలర్లు ఆశించడంతో బ్రాడ్కాస్టర్లు వెనకడుగు వేశారు. దీనికి తోడు, భారత్లోని వీక్షకులకు మ్యాచ్ సమయాలు అనుకూలంగా లేకపోవడం మరో ప్రతికూలాంశంగా మారింది. చాలా మ్యాచ్లు అర్ధరాత్రి, తెల్లవారుజామున జరగనున్నాయి. మొత్తం 104 మ్యాచ్లలో కేవలం 14 మాత్రమే భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రిలోపు ప్రారంభం కానున్నాయి. ఫైనల్ మ్యాచ్ సైతం అర్ధరాత్రి దాటాక 12:30 గంటలకు జరగనుంది. ఈ కారణాలతో జియోస్టార్ కేవలం 20 మిలియన్ డాలర్ల ప్రతిపాదనన ఫిఫా ముందుంచింది. అయితే ఈ ఆఫర్ను ఫిఫా తిరస్కరించింది.
భారత జట్టు ప్రపంచకప్కు అర్హత సాధించకపోయినా, ఇక్కడ ఫుట్బాల్కు విపరీతమైన ఆదరణ ఉంది. 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ను భారత్లో 110 మిలియన్ల మంది డిజిటల్ మాధ్యమాల్లో వీక్షించారు. ఇది ఫిఫా ప్రపంచ వీక్షకుల్లో 2.9 శాతం కావడం విశేషం. ఏదేమైనా, ఆలస్యమైనప్పటికీ అభిమానులకు ప్రపంచకప్ మ్యాచ్లను చూసే అవకాశం లభించడం ఖాయంగానే కనిపిస్తోంది.